దేవాలయం హుండీ పగులగొట్టిన దుండగులు

ABN , First Publish Date - 2021-01-11T15:04:04+05:30 IST

ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండ, సైట్ త్రీ లో చోరీ జరిగింది.

దేవాలయం హుండీ పగులగొట్టిన దుండగులు

హైదరాబాద్: ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండ, సైట్ త్రీలో చోరీ జరిగింది. శ్రీ చిత్తారమ్మ, పెద్దమ్మ దేవాలయంలో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు హుండీ  పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. అందులో ఉన్న నగదును దోచుకెళ్లారు. దేవాలయంలో ఏదో అలికిడి రావడంతో స్థానికులు కేకలు వేశారు. దీంతో దుండగులు పారిపోయారు. దేవాలయ కమిటీ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-01-11T15:04:04+05:30 IST