కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-06-01T18:00:19+05:30 IST

కౌతాళం మండలం, తిప్పలదొడ్డిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత

కర్నూలు జిల్లా: కౌతాళం మండలం, తిప్పలదొడ్డిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు వేటకొడవళ్లు, కర్రలతో దాడి చేశాయి. ఈ ఘటనలో ఐదుగురు టీడీపీ నేతలకు గాయాలు అయ్యాయి. వ్యవసాయ భూమి దారి విషయంలో ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో టీడీపీకి చెందిన మల్లయ్య, మల్లారెడ్డితోపాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, దాడి చేసినవారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఆస్పత్రికి వెళ్లకుండా గాయాలతో పీఎస్ ఎదుట బైఠాయించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో కూడా గొడవలు జరిగినప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు. చివరికి పోలీసులు కేసు నమోదు చేయడంతో బాధితులు చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లారు.

Updated Date - 2020-06-01T18:00:19+05:30 IST