మైలవరంలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-06-17T01:59:21+05:30 IST
జిల్లాలోని మైలవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మైలవరంలోని
కృష్ణా: జిల్లాలోని మైలవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మైలవరంలోని మహదేవ్ ఆస్పత్రిలో వైద్యం వికటించి మొరుసుమల్లి తండాకు చెందిన బాలుడు వంకాడోతు లక్కీ (5) మృతి చెందాడు. తేలు కుట్టడంతో చికిత్స కోసం మహాదేవ్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఫిట్స్ వచ్చి బాలుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళన చేశారు. పోలీసులు, బంధువుల మధ్య తోపులాట జరిగింది.