'టెన్త్ ఉత్తీర్ణత మార్కులు 30కి తగ్గించాలి'
ABN , First Publish Date - 2020-05-28T12:03:10+05:30 IST
'టెన్త్ ఉత్తీర్ణత మార్కులు 30కి తగ్గించాలి'
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో పరీక్షల వాయిదాతో పదో తరగతి విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి ఉందని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తెలిపింది. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో విద్యార్థులపై మానసిక ఒత్తిడి తగ్గించేందుకు పదో తరగతి ఉత్తీర్ణత మార్కులు 35 నుంచి 30కి తగ్గించాలని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మల్లారెడ్డి, నూతనకంటి బాబు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వారు బుధవారం విద్యాశాఖ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు.