నీటి సంపులో పడి బాలుడు మృతి
ABN , First Publish Date - 2021-09-19T05:12:04+05:30 IST
నీటి సంపులో పడి బాలుడు మృతి
కొత్తూర్: అడకుంటూ తండ్రి వెంట వచ్చి పరిశ్రమ నీటి సంపులో పడి పవన్ అలియాస్ ఆర్యా(3) అనే బాలుడు మృతిచెందాడు. ఎస్సై సయీద్ తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తర్ప్రదేశ్కు చెందిన భూపేందర్ కొత్తూర్కు వలసి వచ్చి రాఘవేంద్ర పాలిమర్స్లో పనిచేస్తూ.. పరిశ్రమ ఆవరణలోని క్వార్టర్స్లో కుటుంబంతో సహా ఉంటున్నాడు. శనివారం ఉదయం భూపేందర్ తన కొడుకు పవన్ తో కలిసి పరిశ్రమలోని నీటి సంపు వద్దకు వచ్చాడు. భూపేందర్ వేరే వ్యక్తితో మాట్లాడుతుండగా.. సంపు వద్దకు వెళ్లిన పవన్ నీటి సంపులో పడిపోయాడు. దాన్ని తండ్రి గుర్తించలేదు. కొద్ది సేపటికి భూపేందర్ కొడుకు కోసం వెతుకగా నీటి సంపులో శవమయ్యాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. భూపేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సయూద్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బాతుక లావణ్య పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంపునకు వాల్ కట్టకపో వడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. బాలుడి కుటుంబాన్ని అన్ని విధాలా అదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.