పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
ABN , First Publish Date - 2021-10-23T04:52:10+05:30 IST
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
మేడ్చల్: పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యతగా గుర్తించాలని గుండ్లపోచంపల్లి మునిపాలిటీ కమిషనర్ అమరేందర్రెడ్డి అన్నారు. నగరంలోని గోకరాజు రంగరాజు విద్యాసంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులు గుండ్లపోచంపల్లి బసవ గుడిలో శ్రమదానం చేసి, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీ కమిషనర్ అమరేందర్రెడ్డి ముఖ్యఅథితిగా పాల్గొని మాట్లాడుతూ.. సమాజంలో పేదలకు సాయం చేయడానికి ప్రతిఒక్కరూ ముందుకురావాలని కోరారు. ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు మునిసిపాలిటీలలో శ్రమదానం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గోకరాజు రంగరాజు విద్యాసంస్థల ప్రొఫెసర్ పద్మ, విద్యార్థులు పాల్గొన్నారు.