ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు గడువు మే 20

ABN , First Publish Date - 2021-05-08T05:35:01+05:30 IST

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు గడువు మే 20

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు గడువు మే 20

షాబాద్‌/ఆదిభట్ల : తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు గడువును ఈనెల 20వరకు పొడిగిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ శ్రీవాచ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. షాబాద్‌ మోడల్‌ స్కూల్లో 2021-2022 విద్యా సంవత్సరానికి గాను 6 నుంచి 10వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైందన్నారు. 6వ తరగతిలో 100సీట్లు, 7 నుంచి 10వ తరగతిలో మిగిలిన సీట్లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా జూన్‌ 5న 7నుంచి 10వ తరగతికి జూన్‌ 6న ఆరో తరగతికి ప్రవేశ పరీక్షలుంటాయని తెలిపారు. హాల్‌టికెట్లు జూన్‌ 1 నుంచి 6 వరకు డౌన్లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఓసీ విద్యార్థులు రూ.150, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.75 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కాగా ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతితో పాటు ఏడు నుంచి తొమ్మిదో తరగ తుల వరకు ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 20 వరకు పొడిగించడం జరిగిందని బొంగ్లూరు మోడల్‌ స్కూలు ప్రిన్సిపల్‌ లావణ్య శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Updated Date - 2021-05-08T05:35:01+05:30 IST