అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ టవర్ ఎక్కిన రైతు

ABN , First Publish Date - 2020-08-03T23:26:58+05:30 IST

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ టవర్ ఎక్కిన రైతు

అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేలపాడులోని రైతు పూర్ణ చంద్రరావు టవర్ దగ్గర క్రేన్‌పై ఎక్కి నిరసనకుదిగాడు. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో ప్రభుత్వం తీసుకురావడంతో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు సోదరుడు పులి చిన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అమరావతి రాజధాని అవుతుందని ఓ ఎంపీ వెంట తిరిగి చాలా డబ్బులు ఖర్చుపెట్టి, భూములిచ్చి అప్పులపాలయ్యాడని..ఇప్పుడు మూడు రాజధానుల ప్రకటన రాగానే తన సోదరుడు మనస్తాపం చెంది క్రేన్ ఎక్కి నిరసనకు దిగాడన్నారు. పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అన్ని విధాల రైతులను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం జరగాలని, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తేనే టవర్ దిగుతానని, లేకుంటే కిందికి దూకుతానని స్పష్టం చేశాడు.

Updated Date - 2020-08-03T23:26:58+05:30 IST