ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పదవీ విరమణను ఆమోదించిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-07-20T23:14:36+05:30 IST

ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పదవీ విరమణను ప్రభుత్వం ఆమోదించింది. విధుల నుంచి ప్రభుత్వం రిలీవ్ చేసింది.

ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పదవీ విరమణను ఆమోదించిన ప్రభుత్వం

హైదరాబాద్: ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పదవీ విరమణను ప్రభుత్వం ఆమోదించింది. విధుల నుంచి ప్రభుత్వం రిలీవ్ చేసింది. ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) ప్రకటించారు. ఇంకా ఆరేళ్ల సర్వీసు మిగిలే ఉన్నా.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన వీఆర్‌ఎస్‌ దరఖాస్తును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు సోమవారం ఈ-మెయిల్‌ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. 1995 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్‌ ప్రస్తుతం అదనపు డీజీపీ హోదాలో ఉన్నారు. 26 ఏళ్ల సర్వీస్‌లో 17 ఏళ్లు పోలీస్‌ శాఖలో వివిధ హోదాల్లో పని చేశారు. 2002 నుంచి 2004 వరకు కరీంనగర్‌ ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. మూడేళ్లు గ్రేహౌండ్స్‌ ఐజీగా పనిచేశారు. 


గురుకులాల కార్యదర్శిగా ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, స్వేరోస్‌ పేరిట సైన్యాన్ని తయారు చేశారనే విమర్శలు వచ్చాయి. గురుకులాల్లో నియామకాలు, సరుకులు, మెటీరియల్‌ కాంట్రాక్టుల్లో ఇష్టారాజ్యం నడుస్తోందని,  ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. సంబంధిత మంత్రి పేషీకి తెలియకుండా ఇటీవల తొమ్మిది గురుకులాలకు ప్రిన్సిపాళ్ల నియామకం జరిగినట్లు నేరుగా సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు వెళ్లింది.

Updated Date - 2021-07-20T23:14:36+05:30 IST