కరోనా నియంత్రణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది: సీఎం జగన్
ABN , First Publish Date - 2020-03-30T21:57:14+05:30 IST
కరోనా నియంత్రణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని సీఎం జగన్ తెలిపారు. ట్రస్టులు, ఎన్జీవోలు, కార్పొరేట్ సంస్థల అధిపతులు సాయం చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
అమరావతి: కరోనా నియంత్రణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని సీఎం జగన్ తెలిపారు. ట్రస్టులు, ఎన్జీవోలు, కార్పొరేట్ సంస్థల అధిపతులు సాయం చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సర్జికల్, ఎన్95 మాస్క్లు, పీపీఈ యూనిట్లు, మొబైల్ ఎక్స్రే మిషన్లు.. వెంటిలేటర్లు, శానిటైజర్ల రూపంలో సాయం చేయాలని కోరారు. ఎంబీబీఎస్ డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది సేవ చేసేందుకు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. క్వారంటైన్ సెంటర్లు, ఐసోలేషన్ వార్డుల్లో పనిచేయడానికి నాన్ మెడికల్ వాలంటీర్లు ముందుకు రావాలన్నారు. రవాణా సాయం చేయడానికి అన్ని ప్రాంతాల్లో ముందుకు రావాలని జగన్ పిలుపునిచ్చారు.