ఏపీలో దేశంలోనే అతి పెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ : భెల్
ABN , First Publish Date - 2021-09-17T09:34:50+05:30 IST
ప్రభుత్వ రంగంలోని బీహెచ్ఈఎల్ దేశంలోనే అతి పెద్ద ఫ్లోటింగ్ సోలార్ ఫొటోవోల్టాయిక్ ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించింది.
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని బీహెచ్ఈఎల్ దేశంలోనే అతి పెద్ద ఫ్లోటింగ్ సోలార్ ఫొటోవోల్టాయిక్ ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించింది. రాష్ట్రంలోని ఎన్టీపీసీ సింహాద్రి ప్లాంట్లో 25 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ఫ్లోటింగ్ ఎస్పీవీ ప్రాజెక్టును 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినట్టు భెల్ ప్రకటించింది. ఇది తాము సృష్టించిన ఇంజనీరింగ్ అద్భుతం అని భెల్ పేర్కొంది. ఈ ప్రాజెక్టు ఎంతో విలువైన భూవనరులను పొదుపు చేయడంతో పాటు నీరు ఆవిరి కాకుండా నివారించగలుగుతుంది. గంటకి 180 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకోగలిగే శక్తితో దీన్ని డిజైన్ చేసినట్టు తెలిపింది.