పసిడి పరుగులు
ABN , First Publish Date - 2021-05-19T05:42:19+05:30 IST
విలువైన లోహాలు మళ్లీ కొండెక్కుతున్నాయి. మంగళవారం ముంబై మార్కెట్లో పది గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర రూ.273 పెరిగి రూ.48,419కి చేరింది. అలాగే కేజీ వెండి రూ.1,433 పెరిగి రూ.73,168కి ఎగబాకింది
ముంబైలో 10 గ్రాముల బంగారం రూ.48,419
రూ.73,000కు కిలో వెండి ధర
విలువైన లోహాలు మళ్లీ కొండెక్కుతున్నాయి. మంగళవారం ముంబై మార్కెట్లో పది గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర రూ.273 పెరిగి రూ.48,419కి చేరింది. అలాగే కేజీ వెండి రూ.1,433 పెరిగి రూ.73,168కి ఎగబాకింది. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి తులానికి రూ.333 పెరిగి రూ.47,833కు చేరుకుంది. కిలో వెండి ఏకంగా రూ.2,021 ఎగబాకి రూ.73,122 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్ బలహీనపడటంతో పాటు ఆ దేశంలో ధరాఘాతం పెరుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాల రేట్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. అక్కడ ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ రేటు ఒక దశలో 1,870 డాలర్లకు చేరుకోగా.. సిల్వర్ 2,8.48 డాలర్ల వద్ద ట్రేడైంది.