దూదేకుల బంధును ప్రకటించాలి

ABN , First Publish Date - 2021-09-19T05:32:17+05:30 IST

దళితబంధు తరహాలో దూదేకుల బంధును వెంటనే ప్రకటించాలని తెలంగాణ నూర్‌బాష్‌, దూదేకుల ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ సయ్యద్‌బాషా డిమాండ్‌ చేశారు.

దూదేకుల బంధును  ప్రకటించాలి

ఖమ్మంచర్చికాంపౌండ్‌,సెప్టెంబరు18: దళితబంధు తరహాలో దూదేకుల బంధును వెంటనే ప్రకటించాలని తెలంగాణ నూర్‌బాష్‌, దూదేకుల ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ సయ్యద్‌బాషా డిమాండ్‌ చేశారు. శనివారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్‌ బడే సాహెబ్‌ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దూదేకుల ఫెడరేషన్‌ ఏర్పాటుచేసి వందశాతం రాయి తీతో రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ సమా వేశం లో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడుమీరా, రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు జానీబేగం, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరి కలాం, రాష్ట్రనాయకులు లాల్‌జాన్‌ పాషా, రాష్ట్ర సహా య కార్యదర్శి సోందుమియా, రాష్ట్ర అధికార ప్రతినిధి అన్వర్‌ పాషా, జిల్లా గౌరవ అధ్యక్షులు పుల్లా సాహెబ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు మీరా సాహెబ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-09-19T05:32:17+05:30 IST