తిరుపతిలో రీ నామినేషన్లల ప్రక్రియ పూర్తి
ABN , First Publish Date - 2021-03-02T22:12:20+05:30 IST
పటిష్ట భద్రత మధ్య తిరుపతిలో రీ నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది
తిరుపతి: పటిష్ట భద్రత మధ్య తిరుపతిలో రీ నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. 21వ డివిజన్లో టీడీపీ తరపున మునెమ్మ రీ నామినేషన్ వేశారు. టీడీపీ ఇచ్చిన బీ ఫామ్ను రిటర్నింగ్ అధికారికి మునెమ్మ అందజేశారు. 45వ డివిజన్లో టీడీపీ తరపున చంద్రమోహన్ రీ నామినేషన్ వేశారు. టీడీపీ ఇచ్చిన బీ ఫామ్ను రిటర్నింగ్ అధికారికి చంద్రమోహన్ అందజేశారు. 2వ డివిజన్లో దాసరి విమల టీడీపీ తరపున రీ నామినేషన్ వేశారు. టీడీపీ ఇచ్చిన బీ ఫామ్ను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
అయితే 10వ డివిజన్లో రీ నామినేషన్ వేయడానికి అవకాశం ఉన్నా బీజేపీ అభ్యర్థి శరవణ నామినేషన్ వేయలేదు. 41,8 డివిజన్కి చెందిన టీడీపీ అభ్యర్థులు కిడ్నాప్ గురయ్యారని, ప్రలోభాలకు గురయ్యారని ప్రచారం జరుగుతోంది.