రైతు సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2020-07-08T10:51:29+05:30 IST

రైతు సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిం దని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కడ్తాల, ముద్విన్‌, ..

రైతు సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శం

కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ 

ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి


కడ్తాల్‌: రైతు సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిం దని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కడ్తాల, ముద్విన్‌, మక్తమాదారం, రావిచెడ్‌లలో మంగళవారం వారు రైతువేదిక భవన నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తుందన్నారు. పంట పెట్టుబడి కోసం ఎకరాకు రూ.5వేల చొప్పున ఏడాదికి రూ.10వేల సాయం అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌  లక్ష్మారెడ్డి, జేడీఏ గీతారెడ్డి, జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, ఎంపీపీ కమ్లీమోత్య నాయక్‌, సింగిల్‌విండో చైర్మన్‌ వెంకటేశ్‌, వీరయ్య, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, తహసీల్దార్‌ మహేందర్‌రెడ్డి, ఎంపీడీవో అనురాధ, ఏఈ వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-08T10:51:29+05:30 IST