భాగవత్ మాటలన్నీ అబద్ధం: ఒవైసీ
ABN , First Publish Date - 2021-10-17T08:53:03+05:30 IST
ముస్లింల జనాభా పెరుగుతోందన్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్పై హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ముస్లింల జనాభా పెరుగుతోందన్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్పై హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. భాగవత్ ఎప్పటిలాగే అబద్ధాలు మాట్లాడారన్నారు. నిజానికి ముస్లింల జనాభా తగ్గిందని, 2001-2011 మధ్య పెళ్లయిన పిల్లల్లో 84% మంది హిందువులే ఉన్నారని చెప్పారు. చైనా సైనికులు చొచ్చుకురాకుండా ఆపడంలో మోదీ సర్కారు విఫలమైందన్నారు.