వలంటీర్లతో ఓటర్లను భయపెడుతున్నారు: కళా

ABN , First Publish Date - 2021-03-08T10:33:03+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేయాలని, లేకపోతే సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని అధికార పార్టీ ప్రజలను

వలంటీర్లతో ఓటర్లను భయపెడుతున్నారు: కళా

విశాఖపట్నం, మార్చి 7(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేయాలని, లేకపోతే సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని అధికార పార్టీ ప్రజలను భయపెడుతోందని టీడీపీ సీనియర్‌ నేత కిమిడి కళావెంకట్రావు ఆదివారమిక్కడ ఆరోపించారు. సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల ఇళ్లకు వాచ్‌మెన్‌ను(వలంటీర్లు) పంపి, ఓటరు స్లిప్పులు అందజేస్తూ వైసీపీకి ఓటు వేయాలని ఒత్తిడి తెస్తున్నారని అన్నారు.తమకు సహకరించని అధికారుల సంగతి పోలింగ్‌ ముగిసిన తరువాత తేలుస్తాతామని స్వయంగా మంత్రులే బెదిరించడం దారుణమని అన్నారు. 

Updated Date - 2021-03-08T10:33:03+05:30 IST