ప్రియుడి చేతిలో మోసపోయిన ప్రియురాలు

ABN , First Publish Date - 2020-02-28T10:52:17+05:30 IST

ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ మండలంలోని పెద్దకోర్పోలు గ్రామానికి చెందిన

ప్రియుడి చేతిలో మోసపోయిన ప్రియురాలు

పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి 


నెక్కొండ, ఫిబ్రవరి27: ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ మండలంలోని పెద్దకోర్పోలు గ్రామానికి చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై నాగరాజు గురువారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దకోర్పోలు గ్రామానికి చెందిన గంట వినయ్‌ అనే యువకుడు ఇదే గ్రామానికి చెందిన యువతిని నాలుగు సంవత్సరాల నుంచి పెళ్ళి చేసుకుంటానంటూ అతని వెంట తిప్పుకున్నాడు. డిగ్రీ పూర్తి చేసిన వినయ్‌  హైదరాబాద్‌లో ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న యువతిని ప్రైవేట్‌ ఉద్యోగం ఇప్పిస్తానంటూ హైదరాబాద్‌లో ఉంచి ఇద్దరు కొంత కాలం సహజీవనం చేశారు. అయితే ఆర్థికంగా స్థిరపడ్డాక పెళ్ళి చేసుకుందామని చెప్పిన వినయ్‌, యువతి తక్కువ కులానికి చెందినదంటూ పెళ్ళికి నిరాకరించాడని తెలపారు. వినయ్‌ కమ్యూనిటికి చెందిన మరో యువతితో పెళ్ళికి సిద్ధపడ్డాడు. తనను కులాంతర వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని పేర్కొంటూ వినయ్‌ని చట్టపరంగా శిక్షించి, తనకు న్యాయం చేయాలంటూ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. కాగా, వినయ్‌ కుటుంబ సభ్యులు ఎవరు గ్రామంలో లేరు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2020-02-28T10:52:17+05:30 IST