భారత జట్లకు సులువైన డ్రా

ABN , First Publish Date - 2020-08-04T09:10:03+05:30 IST

బ్యాడ్మింటన్‌లో ప్రతిష్ఠాత్మకమైన టోర్నమెంట్‌ థామస్‌, ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌లో భారత జట్లకు సులువైన డ్రా లభించింది. ఈ ఈవెంట్‌ అక్టోబరు 3 నుంచి 11 వరకు ...

భారత జట్లకు సులువైన డ్రా

అక్టోబరు 3 నుంచి థామస్‌, ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌లో ప్రతిష్ఠాత్మకమైన టోర్నమెంట్‌ థామస్‌, ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌లో భారత జట్లకు సులువైన డ్రా లభించింది. ఈ ఈవెంట్‌ అక్టోబరు 3 నుంచి 11 వరకు డెన్మార్క్‌లో జరగనుంది. థామస్‌ కప్‌లో భారత పురుషుల జట్టుకు డెన్మార్క్‌, జర్మనీ, అల్జీరియాతో కలిపి గ్రూప్‌-సిలో చోటు దక్కింది. మహిళల్లో గ్రూప్‌-డి నుంచి 14 సార్లు చాంపియన్‌ చైనా, ఫ్రాన్స్‌, జర్మనీతో కలిసి పోటీపడనుంది. లీగ్‌ దశలో 16 జట్లు 4గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. ప్రతి గ్రూపు నుంచి తొలి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌ దశకు అర్హత సాధిస్తాయి. 

Updated Date - 2020-08-04T09:10:03+05:30 IST