15 రోజుల్లో ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2021-05-14T08:54:40+05:30 IST

కరోనా బారినపడి 15 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించిన ఘటన నిర్మల్‌ జిల్లాలో చోటుచేసుకుంది

15 రోజుల్లో ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

జగిత్యాలలో రెండ్రోజుల్లో అన్నదమ్ములు బలి


కరోనా బారినపడి 15 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించిన ఘటన నిర్మల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. సోన్‌ మండలం న్యూ వెల్మల్‌ గ్రామానికి చెందిన బచ్చు కిషన్‌(75), ప్రేమల(70), వారి కుమారుడు రాజ్‌కుమార్‌(38) కిరాణం దుకాణం నిర్వహిస్తున్నారు. రెండు వారాల క్రితం వైరస్‌ సోకిన ప్రేమల హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించింది. గత వారం భర్త కిషన్‌ చనిపోయాడు. రాజ్‌కుమార్‌ గురువారం ప్రాణాలు కోల్పోయాడు. ఇతడి భార్య హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో మ్యూజిక్‌ సెంటర్‌ నిర్వహించే చెట్ల రాజు(45) ఇటీవల వైరస్‌ బారినపడ్డాడు. గురువారం మృతి చెందాడు. అతడి అన్న రవీందర్‌(48) ఈనెల 12వ తేదీన కరోనాతో మృతి చెందాడు.

Updated Date - 2021-05-14T08:54:40+05:30 IST