ఏపీలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-04-02T22:24:43+05:30 IST
ఏపీలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసులతో ఏపీలో మొత్తం 135కి కరోనా పాజిటివ్ కేసులు చేరాయి. గుంటూరు, కడపలో మరో రెండు కరోనా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
అమరావతి: ఏపీలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసులతో ఏపీలో మొత్తం 135కి కరోనా పాజిటివ్ కేసులు చేరాయి. గుంటూరు, కడపలో మరో రెండు కరోనా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి మర్కజ్కు 1,085మంది వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన 758మంది శాంపిల్స్ను వైద్యులు పరీక్షించారు. 91మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఏపీ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది.