టోక్యో ఒలింపిక్స్.. నేటి అప్డేట్స్
ABN , First Publish Date - 2021-08-03T01:17:51+05:30 IST
ఒలింపిక్స్లో భారత్కు ఈ రోజు మిశ్రమ ఫలితాలు లభించాయి. కొద్దిసేపటి క్రితం జరిగిన మహిళల డిస్కస్ త్రో ఫైనల్స్లో
టోక్యో: ఒలింపిక్స్లో భారత్కు ఈ రోజు మిశ్రమ ఫలితాలు లభించాయి. కొద్దిసేపటి క్రితం జరిగిన మహిళల డిస్కస్ త్రో ఫైనల్స్లో కమల్ప్రీత్ సింగ్ నిరాశ పరిచింది. 63.72 మీటర్లు మాత్రమే విసిరి ఆరో స్థానానికి పరిమితమైంది. అమెరికాకు చెందిన వి.ఆల్మన్ 68.98 దూరం విసిరి టాప్ ప్లేస్లో నిలిచి స్వర్ణం సొంతం చేసుకోగా, జర్మనీకి చెందిన కె.పుడెంజ్ 66.86 మీటర్లు విసిరి రజతం సాధించింది. క్యూబాకు చెందిన వై.పెరెజ్ 65.72 మీటర్లు విసిరి కాంస్య పతక విజేతగా నిలిచింది.
ఒలింపిక్స్ 11వ రోజైన నేడు భారత్ శుభారంభం చేసింది. భారత మహిళల హాకీ జట్టు ప్రపంచ నంబర్ 2 ఆస్ట్రేలియాను క్వార్టర్ ఫైనల్లో మట్టికరిపించి సెమీస్కు చేరుకుంది. భారత జట్టు సెమీస్కు చేరడం కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. 200 మీటర్ల పరుగులో సెమీస్కు చేరుకోవడంలో ద్యూతీ చంద్ విఫలమైంది. ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక షూటర్లు ఐశ్వర్యప్రతాప్ సింగ్ తోమర్, సంజీవ్ రాజ్పుట్ ఫైనల్ రేస్కు అర్హత సాధించలేకపోయారు. ఈక్వెస్ట్రియన్లో ఫౌవాద్ మీర్జా వ్యక్తిగత జంపింగ్లో ఫైనల్కు చేరుకున్నాడు. 8 పాయింట్లు గెలుచుకుని 47.20 స్కోరు చేశాడు.