రెండు రోజులుగా భార్యకు చిత్రహింసలు.. కొడుకుతో వీడియో చిత్రీకరణ

ABN , First Publish Date - 2020-02-28T11:56:20+05:30 IST

రెండు రోజులుగా భార్యకు చిత్రహింసలు.. కొడుకుతో వీడియో చిత్రీకరణ

రెండు రోజులుగా భార్యకు చిత్రహింసలు.. కొడుకుతో వీడియో చిత్రీకరణ

నార్సింగ్‌(ఆంధ్రజ్యోతి): భార్య ప్రవర్తనపై భర్తకు అనుమానం రావడంతో ఆమెను రెండు రోజులపాటు గదిలో బంధించి వివస్త్రను చేసి చిత్రహింసలకు గురిచేస్తూ.. కొడుకుతో వీడియో తీయించాడు. నార్సింగ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వనపర్తి జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ దంపతులు కోకాపేట రాజీవ్‌గృహకల్పలో నివసిస్తున్నారు. శ్రీనివా్‌సకు మంజుల అనే మహిళతో 12 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య ప్రవర్తనపై అతడికి అనుమానాలున్నాయి. ఈ నెల 24వ తేదీ రాత్రి మద్యం తాగొచ్చిన శ్రీనివాస్‌ భార్యను చిత్రహింసలకు గురిచేసి వివస్త్రను చేసి దాడిచేసి కుమారుడితో సెల్‌ఫోన్‌లో వీడియో తీయించాడు. తప్పించుకున్న మంజుల తనతల్లిదండ్రులు ఉంటున్న వనపర్తి గ్రామానికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు ఆమెను మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. కేసును నార్సింగ్‌ పోలీసులకు బదిలీ చేశారు. మంజుల బంధువు రామకృష్ణ ఈనెల 25న దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడని, బాధితురాలు చికిత్స పొందుతుందని, ఆమె కోలుకున్న తర్వాత వివరాలు సేకరించామని, శ్రీనివా్‌సపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ తెలిపారు.   

Updated Date - 2020-02-28T11:56:20+05:30 IST