పార్టీ నుంచి బహిష్కరిస్తా.. తొలి స్పీచ్లోనే రేవంత్ వార్నింగ్
ABN , First Publish Date - 2021-07-07T21:38:07+05:30 IST
టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి ప్రసంగంలోనే కార్యకర్తలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి ప్రసంగంలోనే కార్యకర్తలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేస్తున్న కార్యకర్తలను వద్దని వారించారు. అందరం సమష్టిగా కలిసి పని చేస్తామని... అధిష్ఠానం నిర్ణయాలకు కట్టుబడి ఉంటామన్నారు. ఎవరూ అలాంటి నినాదాలు చేయొద్దన్నారు.
ప్రసంగం సందర్భంగా.. పీసీసీ అధ్యక్షులుగా నియమించిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. వర్షం పడుతుంటంతో.. వరుణ దేవుడు కూడా ఈ రోజు ఆశీర్వదించడానికి వచ్చారన్నారు. ఈ రోజు నుంచి జై సోనియా, జై రాహుల్ గాంధి నినాదాలు మాత్రమే వినిపించాలని, ఎవరైనా వ్యక్తిగత నినాదాలు ఇస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తానని హెచ్చరించారు.