అదుపు తప్పి ట్రాక్టర్‌ బోల్తా.. వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-03-02T05:10:28+05:30 IST

అదుపు తప్పి ట్రాక్టర్‌ బోల్తా.. వ్యక్తి మృతి

అదుపు తప్పి ట్రాక్టర్‌ బోల్తా.. వ్యక్తి మృతి

బొంరాస్‌పేట్‌:  ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో  వ్యక్తి  మృతి చెందాడు. ఈ ఘటన బొంరా్‌సపేట్‌ మండలం దుద్యాల్‌ గ్రామ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. పర్సాపూర్‌ గ్రామానికి చెందిన డ్రైవర్‌ వెంకటయ్య (44)దుద్యాల్‌ గ్రామానికి బోరు మోటార్‌ను తీసేందుకు ట్రాక్టర్‌ను తీసుకెళ్తున్నాడు.  ఈ క్రమంలో దుద్యాల్‌ సమీపంలో ట్రాక్టర్‌ అదుపు తప్పడంతో  బోల్తాపడి అతను అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని  కేసు దర్యాప్తు చేసున్నారు. 

Updated Date - 2021-03-02T05:10:28+05:30 IST