అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-03-02T05:10:28+05:30 IST
అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
బొంరాస్పేట్: ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బొంరా్సపేట్ మండలం దుద్యాల్ గ్రామ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. పర్సాపూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ వెంకటయ్య (44)దుద్యాల్ గ్రామానికి బోరు మోటార్ను తీసేందుకు ట్రాక్టర్ను తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో దుద్యాల్ సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పడంతో బోల్తాపడి అతను అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేసున్నారు.