మదనపల్లిలో అటవీ ఉద్యోగి చెంప చెళ్లుమనిపించిన ట్రాఫిక్ కానిస్టేబుల్

ABN , First Publish Date - 2021-06-15T00:55:00+05:30 IST

మదనపల్లిలో అటవీ ఉద్యోగి చెంప చెళ్లుమనిపించిన ట్రాఫిక్ కానిస్టేబుల్

మదనపల్లిలో అటవీ ఉద్యోగి చెంప చెళ్లుమనిపించిన ట్రాఫిక్ కానిస్టేబుల్

చిత్తూరు: కర్ఫ్యూ సమయంలో కాస్త దారి తీయమన్నందుకు ఓ అటవీ శాఖ ఉద్యోగి చెంప చెళ్లుమనిపించాడు ట్రాఫిక్ కానిస్టేబుల్. మదనపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మదనపల్లెలో మధ్యాహ్నం 2 గంటల నుంచి కర్ఫ్యూ అమలులో ఉంది. ఈ క్రమంలో విధులు ముగించుకుని ఏబీవో రామయ్య ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరారు. బస్టాండ్ దగ్గర అడ్డంగా బారికేడ్లు ఉంచి ట్రాఫిక్ కానిస్టేబుల్ జగదీశ్ విధులు నిర్వహిస్తున్నారు. కాస్త దారిస్తే వెళ్తానని రామయ్య కోరగా జగదీశ్ నిరాకరించారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాటామాట పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆవేశానికి గురైన కానిస్టేబుల్ ఏబీవో రామయ్య చొక్కా పట్టుకుని చెంపపై కొట్టాడు

Updated Date - 2021-06-15T00:55:00+05:30 IST