కోడి పందేలలో విషాదం: ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-02-23T06:53:59+05:30 IST
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని లొత్తునూర్లో సోమవారం నిర్వహించిన కోడి పందేలలో విషాదం నెలకొంది.
గొల్లపల్లి, ఫిబ్రవరి 22: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని లొత్తునూర్లో సోమవారం నిర్వహించిన కోడి పందేలలో విషాదం నెలకొంది. లొత్తునూరు ఎల్లమ్మ ఆలయం వద్ద నిర్వహించిన పందేలలో పాల్గొనడానికి వెల్గటూర్ మండలం కొండాపూర్కు చెందిన తనుగుల సతీశ్ గౌడ్(45) తన పందెం కోడితో వచ్చాడు. కోడికాలికి కత్తిని కట్టి దానిని గట్టిగా పట్టుకున్నాడు. కోడి తప్పించుకోవడానికి యత్నిస్తున్న క్రమంలో దాని కాలికి కట్టిన కత్తి సతీశ్ను తీవ్రంగా గాయపరిచింది. అతనిని జగిత్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.