ఏపీ డెయిరీ కేసుపై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2021-06-04T01:21:33+05:30 IST
ఏపీ డెయిరీ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ డెయిరీని నిర్వీర్యం చేసి అమూల్కు లబ్ధి చేకూరేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని
అమరావతి: ఏపీ డెయిరీ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ డెయిరీని నిర్వీర్యం చేసి అమూల్కు లబ్ధి చేకూరేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదించారు. ఏపీ డెయిరీని ధారాదత్తం చేయడం కారణంగా కో-ఆపరేటివ్, ప్రైవేట్.. ప్రభుత్వ డెయిరీలకు తీవ్ర నష్టమని న్యాయవాది తెలిపారు. ఎన్డీడీబీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, చట్టపరంగా ఏర్పడిందని న్యాయవాది చెప్పారు. మహిళా పాడిరైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం తరుపు న్యాయవాది తెలిపారు. దీని వల్ల అమూల్కు ఒక్క రూపాయి కూడా లాభం లేదన్న ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదించారు. తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా పడింది.