శ్రీపాదరావుకు ఘన నివాళి

ABN , First Publish Date - 2021-04-14T05:39:37+05:30 IST

శ్రీపాదరావుకు ఘన నివాళి

శ్రీపాదరావుకు ఘన నివాళి
మల్హర్‌ మండలం వల్లెంకుంటలో శ్రీపాదరావు విగ్రహం వద్ద కాంగ్రెస్‌ నేతలు

మల్హర్‌, ఏప్రిల్‌ 13 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల  శ్రీపాదరావు వర్ధంతిని మండ లంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మంగళ వారం నిర్వహించారు. కొయ్యూర్‌, వల్లెం కుంటలోని ఆయన విగ్రహాలకు పూలమాల వేసి నివాళుల ర్పించారు. గ్రామస్థులకు మజ్జిగ, పండ్లు పంపిణీ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు బడితల రాజయ్య, ఎంపీపీ చింతలపల్లి మల్హల్‌రావు, జడ్పీటీసీ అయిత కోమల, సర్పంచ్‌లు రమేష్‌, రాజునాయక్‌, స్వరూ ప, ఉప సర్పంచ్‌ మమత, పీఏసీఎస్‌ డైరెక్టర్లు మొండయ్య, రమేష్‌రెడ్డి తదిత రులు పాల్గొన్నారు.

కాటారం : శ్రీపాదరావు  వర్ధంతిని  మండలంలో కాంగ్రెస్‌ నాయకులు నిర్వహించారు. చింతకాని క్రాస్‌ రోడ్డు వద్ద ఆయన విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలతో నివాళులర్పించారు. ఎంపీపీ పంతకాని సమ్మయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి కుంభం స్వప్న, డీసీసీ ఉపాధ్యక్షుడు గద్దె సమ్మిరెడ్డి, సర్పంచ్‌లు అంగజాల అశోక్‌కు మార్‌, రవికుమార్‌, రఘురాం, సంధ్యసురేందర్‌, సుధాకర్‌, ఎంపీటీసీలు జాడి మహేశ్వరి, అజీజ్‌, నాయకులు రాజేశ్వర్‌రావు, చీమల సందీప్‌, చీమల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. 

 మహదేవపూర్‌ : శ్రీపాదరావు వర్ధంతిని కాంగ్రెస్‌ నాయకులు   నిర్వహిం చారు. అన్నారంలో ఎంపీటీసీ మంచినీళ్ల దుర్గయ్య ఆధ్వర్యంలో నివాళుల ర్పించారు. మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. పార్టీ మండల అధ్యక్షుడు అక్బర్‌ఖాన్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోట రాజబాపు, జడ్పీటీసీ అరుణ, ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్‌, నాయకులు విలాసరావు, వామనరావు, కటకం అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-14T05:39:37+05:30 IST