పోటీ నుంచి విరమించుకున్న చిలుకానగర్ రెబల్ అభ్యర్థి
ABN , First Publish Date - 2020-11-22T23:48:05+05:30 IST
టిఆర్ఎస్ పార్టీ చిల్కానగర్ డివిజన్ నుంచి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అంబటి జగదీష్ పోటీ నుంచి విరమించుకున్నటు తెలిపారు.
హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ చిల్కానగర్ డివిజన్ నుంచి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అంబటి జగదీష్ పోటీ నుంచి విరమించుకున్నటు తెలిపారు. రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మాట మేరకు తన నామినేషన్ ఉపసంహరించుకోవడానికి సిద్ధమయ్యారు.
అయితే ఉపసంహరణ సమయం ముగియడంతో, సాంకేతికంగా విత్ డ్రా సాధ్యం కాక పోయినప్పటికీ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి నేర్డం భాస్కర్ నేతృత్వంలో, మంత్రి సత్యవతి రాథోడ్ మాట మేరకు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గీతా ప్రవీణ్ ముదిరాజ్ కు మద్దతుగా ప్రచారం చేస్తామని, పార్టీ విజయం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనతో పాటు తన అనుచరులు కూడా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గీతా ప్రవీణ్ ముదిరాజ్ విజయానికి కృషి చేస్తారని చెప్పారు.