టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతుంది: మహేష్‌కుమార్‌గౌడ్‌

ABN , First Publish Date - 2021-10-09T21:44:07+05:30 IST

ఏడున్నరేళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతుందని కాంగ్రెస్ నేత మహేష్‌కుమార్‌గౌడ్‌ ఆరోపించారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతుంది: మహేష్‌కుమార్‌గౌడ్‌

హైదరాబాద్: ఏడున్నరేళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతుందని కాంగ్రెస్ నేత మహేష్‌కుమార్‌గౌడ్‌ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచిన పార్టీ  బీజేపీ అని మండిపడ్డారు. ఒక పార్టీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే..మరో పార్టీ దేశంలో ఉన్న సామన్యుల బతుకును చిదిమేస్తోందని దుయ్యబట్టారు. గతంలో మైనారిటీ, గిరిజన రిజర్వేషన్లు కూడా అసెంబ్లీలో  తీర్మానం చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఇప్పుడు బీసీ జనగణనపై చేసిన తీర్మానం కూడా అలాంటి దేనని ఆక్షేపించారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదని మహేష్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు.


Updated Date - 2021-10-09T21:44:07+05:30 IST