టీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీమణి వెనుకంజ.. దూసుకెళ్తున్న బీజేపీ

ABN , First Publish Date - 2020-12-04T19:55:14+05:30 IST

గ్రేటర్ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీమణి వెనుకంజ.. దూసుకెళ్తున్న బీజేపీ

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. ఇప్పటికే మూడు స్థానాల్లో టీఆర్ఎస్ గెలవగా ప్రగతి భవన్‌లో కార్యకర్తలు, నేతలు, గెలిచిన అభ్యర్థుల అనుచరులు స్వీట్లు పంచుకుని.. పటాసులు పేల్చి సంబురాలు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల టీఆర్ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చి.. పోటాపోటీగా ఉంది. అయితే కీలకమైన స్థానాల్లో మాత్రం టీఆర్ఎస్ వెనుకంజలో ఉండగా.. బీజేపీలో ముందంజలో ఉండటం గమనార్హం. దీంతో ఆయా స్థానాల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు టెన్షన్ టెన్షన్‌గా ఉన్నారు.


దూసుకెళ్తున్న బీజేపీ

ఉప్పల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి సతీమణి స్వప్న హబ్సిగూడా 8వ డివిజన్ నుంచి పోటీ చేశారు. కీలకమైన ఈ డివిజన్‌లో ఎమ్మెల్యే సతీమణి వెనుకంజలో ఉండటం గమనార్హం. బీజేపీ అభ్యర్థి కంటే వెయ్యి ఓట్ల వెనుకంజలో టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు. ఈ స్థానంలో బీజేపీ దూసుకెళ్తుండటంతో కార్యకర్తలు, అభ్యర్థి అనుచరులు ఫలితాన్ని ఎంతో ఆసక్తిగా ఫలితాన్ని చూస్తున్నారు. అయితే.. ఈ స్థానంలోనే కాకుండా గతంలో టీఆర్ఎస్ గెలిచిన పలు స్థానాల్లో కూడా ప్రస్తుతం బీజేపీ లీడింగ్‌లో ఉన్నది. మరికొన్ని స్థానాల్లో టీఆర్ఎస్-బీజేపీ పోటాపోటీగా ఉన్నాయి.

Updated Date - 2020-12-04T19:55:14+05:30 IST