తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ఎల్పీ భేటీ
ABN , First Publish Date - 2021-11-16T22:17:24+05:30 IST
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం
హైదరాబాద్: తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం అయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలను సమావేశానికి ఆహ్వానించారు. వరి ధాన్యం కొనుగోలులో కేంద్ర విధానంపై చర్చించనున్నారు. కేంద్రంపై పోరుకు సీఎం కేసీఆర్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 29న తెలంగాణ దీక్షా దివస్ సందర్భంగా ఢిల్లీలో నిరసన చేపట్టే యోచనలో టీఆర్ఎస్ ఉంది.