ఇలా చేసి చూడండి!
ABN , First Publish Date - 2021-03-10T05:30:00+05:30 IST
తాజా పండ్లతో జ్యూసు చేసుకుని తాగితే తలనొప్పి నుంచి త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది. బొప్పాయి పండును పేస్టులా చేసి లేదా బొప్పాయి రసాన్ని ముఖానికి రాసుకుంటే నల్ల మచ్చలు పోతాయి
- తాజా పండ్లతో జ్యూసు చేసుకుని తాగితే తలనొప్పి నుంచి త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది.
- బొప్పాయి పండును పేస్టులా చేసి లేదా బొప్పాయి రసాన్ని ముఖానికి రాసుకుంటే నల్ల మచ్చలు పోతాయి.
- రోజూ ఒక గ్లాసు చెరకు రసం తాగితే మూత్రాశయ సమస్యలు తగ్గుతాయి. కిడ్నీలో రాళ్లు కరుగుతాయి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
- మొటిమల సమస్యకు గుడ్డులోని తెల్లసొన బాగా పనిచేస్తుంది.
- మజ్జిగలో ఒక స్పూను మెంతులు వేసి రాత్రంతా నానబెట్టి, ఉదయాన ఆ నీళ్లను పరగడుపున తాగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
- గంధం పొడి, పసుపు, రోజ్ వాటర్ మిశ్రమాన్ని పేస్టులా చేసుకుని ముఖానికి రాసుకుంటే నల్లబడిన చర్మం మళ్లీ తాజాగా మారుతుంది.
- తేనెలో కొంచెం తులసి రసాన్ని కలిపి తాగితే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.