బీజేపీ మతతత్వ పార్టీ: షర్మిల
ABN , First Publish Date - 2021-10-30T23:33:38+05:30 IST
జాతీయ పార్టీ అయిన బీజేపీ మతతత్వ పార్టీ అని వైఎస్సాఆర్టీపీ అధినేత
రంగారెడ్డి: జాతీయ పార్టీ అయిన బీజేపీ మతతత్వ పార్టీ అని వైఎస్సాఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల ఆరోపించారు. జిల్లాలో జరుగుతున్న ప్రజాప్రస్థానం యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకొనే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో డిగ్రీలు పీజీలు చేసినవాళ్ళు హమాలీలుగా పని చేసే పరిస్థితులు ఉన్నాయన్నారు. తల ఎత్తుకొని తిరగలేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. అయినా సీఎం కేసీఆర్లో చలనం లేదన్నారు.
పేదలంటే కేసీఆర్కి చిన్నచూపన్నారు. తెలంగాణలో ఆడవారికి రక్షణ లేదని ఆమె ఆరోపించారు. కొండ నాలుకకు మందు వేయబోతే ఉన్న నాలుక ఓడినట్లు కేసీఆర్ తీరు ఉందని ఆమె ఎద్దేవా చేసారు. ధరణి పోర్టల్ తెచ్చి భూములు లాక్కున్నారన్నారు. దీనస్థితిలో రాష్ట్రం ఉందన్నారు. కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్రంలో ఏ కుటుంబం బాగు పడలేదన్నారు. ప్రజలు ఆలోచన చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.