టీడీపీ హయాంలో సెంటు భూమి అమ్మలేదు: మాజీ టీటీడీ చైర్మన్‌

ABN , First Publish Date - 2020-05-26T02:22:57+05:30 IST

దాతల భూముల్ని అమ్మే హక్కు ఎవరికీ లేదని మాజీ టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ అన్నారు.

టీడీపీ హయాంలో సెంటు భూమి అమ్మలేదు: మాజీ టీటీడీ చైర్మన్‌

అమరావతి: దాతల భూముల్ని అమ్మే హక్కు ఎవరికీ లేదని మాజీ టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ అన్నారు. టీటీడీ ఆస్తులను కాపాడలేం అని ప్రభుత్వం భావిస్తే మరో కమిటీ వేసి కాపాడాలని సూచించారు. టీడీపీ హయాంలో సెంటు భూమిని కూడా విక్రయించలేదన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే భవిష్యత్తులో స్వామివారికి విరాళాలు ఇవ్వరని పేర్కొన్నారు. టీటీడీ భూముల వేలం ఆలోచన ప్రభుత్వం మానుకోవాలన్నారు. 

Updated Date - 2020-05-26T02:22:57+05:30 IST