కొవిడ్‌ బాధితులకు టీటీడీ సాంత్వన

ABN , First Publish Date - 2021-05-14T08:11:47+05:30 IST

కొవిడ్‌ బాధితుల చికిత్స కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 22 జర్మన్‌ షెడ్లు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. దీనికి శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయో నిధి నుంచి రూ.3.52 కోట్లు మంజూరు చే

కొవిడ్‌ బాధితులకు టీటీడీ సాంత్వన

రాష్ట్రవ్యాప్తంగా 22 జర్మన్‌ షెడ్లు నిర్మాణం!

ఒక్కో షెడ్డులో 30 వరకూ ఆక్సిజన్‌ బెడ్లు

తిరుమల, మే 13(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ బాధితుల చికిత్స కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 22 జర్మన్‌ షెడ్లు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. దీనికి శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయో నిధి నుంచి రూ.3.52 కోట్లు మంజూరు చేస్తూ ఈవో జవహర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ జిల్లాలో 4, ప్రకాశం 2, అనంతపురం 3, కృష్ణా 3, కర్నూలు 2, గుంటూరు 3, కాకినాడ 3, ఇతర ప్రాంతాల్లో మరో 2 షెడ్లు నిర్మించనున్నారు. టీటీడీ ఆమోదించిన అంచనా ఖర్చు మేరకు షెడ్లు నిర్మించుకోవాలని సూచిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు నిధులు అందించనున్నారు. ఒక్కో షెడ్లో దాదాపు 30 ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. 

Updated Date - 2021-05-14T08:11:47+05:30 IST