టీటీడీ భూములను అమ్మాలని కుట్ర చూశారు: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-05-28T23:49:02+05:30 IST

టీటీడీ భూములను అమ్మాలని కుట్ర చూశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. శ్రీశైలం, సింహాచలం భూములు కొట్టేయాలని చూశారని, ఏపీలో అన్ని ఆలయాల భూములు కొట్టేయాలని కుట్ర పన్నుతున్నారని

టీటీడీ భూములను అమ్మాలని కుట్ర చూశారు: చంద్రబాబు

గుంటూరు: టీటీడీ భూములను అమ్మాలని కుట్ర చూశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. శ్రీశైలం, సింహాచలం భూములు కొట్టేయాలని చూశారని, ఏపీలో అన్ని ఆలయాల భూములు కొట్టేయాలని కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌ అడ్వయిజర్లు ఏమీ చేయలేకపోతున్నారని చెప్పారు. వాలంటీర్లు ఎందుకు? మీ కార్యకర్తలకు ఉద్యోగాలిస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని, మీ కార్యకర్తలకు కాదన్నారు. జగన్‌ మొత్తం తప్పుడు విధానాలతో ముందుకెళ్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.

Updated Date - 2020-05-28T23:49:02+05:30 IST