శారదాపీఠం చొరవకు అభినందనలు: విజయశాంతి

ABN , First Publish Date - 2020-05-26T02:46:07+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయాలు వివాదాలకు అతీతంగా ఉండాల్సిన అవసరం ఉందని ..

శారదాపీఠం చొరవకు అభినందనలు: విజయశాంతి

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయాలు వివాదాలకు అతీతంగా ఉండాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి అన్నారు. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆమె స్పందించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి... టీటీడీ బోర్డు ఒకటికి వందసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందన్నారు. లేనిపక్షంలో వివాదాలకు కేంద్రబిందువు అయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. టీటీడీ భూముల వివాదాన్ని పరిష్కరించే దిశగా విశాఖ శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామి తీసుకున్న చొరవను విజయశాంతి అభినందించారు. టీటీడీ బోర్డు నిర్ణయాలపై ఆధ్యాత్మికవేత్తల సూచనలు, సలహాలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తలెత్తే అవకాశం ఉండదని ఆమె చెప్పారు. 



Updated Date - 2020-05-26T02:46:07+05:30 IST