శ్రావణి ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

ABN , First Publish Date - 2020-09-10T23:26:43+05:30 IST

సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. శ్రావణి ఆత్మహత్యకు దేవరాజే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

శ్రావణి ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

హైదరాబాద్: సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. శ్రావణి ఆత్మహత్యకు దేవరాజే కారణమని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంచితే తెరపైకి  మరో యువకుడు సాయి, ‘ఆర్‌ఎక్స్ 100’ నిర్మాత అశోక్‌రెడ్డి పేర్లుకూడా తెరపైకి వచ్చాయి. శ్రావణి మృతికి దేవరాజు కారణమని చెబితే.. కాదు కాదు.. సాయి వల్లే చనిపోయిందని దేవరాజు చెబుతున్నాడు. ఇటు దేవరాజు వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని సాయి చెబుతున్నాడు. దీంతో ఈ కేసులో ఏం జరిగింది అనేది సస్పెన్షన్‌గా మారింది. ఇప్పటికే ఈ కేసులో ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో దేవరాజు విచారణకు హజరయ్యారు. దేవరాజు, సాయి పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.


మరోవైపు దేవరాజుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టిక్‌టాక్‌ను అడ్డుపెట్టుకొని దేవరాజు ఎంతో మంది అమ్మాయిలను తన వెంట తిప్పుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దేవరాజును ఓ ప్లే బాయ్‌గా నిర్ధారించారు. పలువురు అమ్మాయిలతో ప్రేమాయణం నడిపినట్టుగా విచారణలో వెల్లడైంది. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపినట్టుగా తెలుస్తోంది. టిక్‌‌టాక్  వీడియోల ద్వారా ఆ విషయాన్ని  పోలీసులు నిర్ధారించుకున్నారు. అదే మాదిరిగా శ్రావణిని కూడా ప్రేమ పేరుతో ఉచ్చులోకి దింపినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే సాయి, దేవరాజుల పేర్లు బయటకు రాగా ఇప్పుడు అశోక్‌రెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది. శ్రావణి ఆత్యహత్యకు అశోక్‌రెడ్డి కూడా కారణమని దేవరాజు ఆరోపిస్తున్నాడు. మొత్తం ఈ కేసు వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించారు. 

Updated Date - 2020-09-10T23:26:43+05:30 IST