లింగంపల్లి శంభాజి మృతి పట్ల టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం

ABN , First Publish Date - 2020-07-10T00:50:22+05:30 IST

సీనియర్ జర్నలిస్టు, కవి, రచయిత లింగంపల్లి శంభాజి (52) అనారోగ్యంతో మృతి చెందారు. పాంక్రియాటైటిస్

లింగంపల్లి శంభాజి మృతి పట్ల టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం

హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు, కవి, రచయిత లింగంపల్లి శంభాజి (52) అనారోగ్యంతో మృతి చెందారు. పాంక్రియాటైటిస్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శంభాజి మృతి పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్యలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పని చేసిన శంభాజీ నిరంతర అక్షర సైనికుడని వారు పేర్కొన్నారు. అభ్యుదయ భావాలు కలిగిన జర్నలిస్టుగా సామాజిక స్పృహతో వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగిన ఆయన మృతి తీరని లోటు అని అన్నారు. పేదరికంలో ఉన్న శంభాజీ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని వారు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వారు విజ్ఞప్తి చేశారు.


Updated Date - 2020-07-10T00:50:22+05:30 IST