ఏపీపీఎస్సీలో ఇద్దరు సభ్యుల నియామకం
ABN , First Publish Date - 2021-04-21T09:48:44+05:30 IST
ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఖాళీగా ఉన్న రెండు పోస్టుల్లో ఇద్దరు సభ్యులను ప్రభుత్వం నియమించింది.
అమరావతి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఖాళీగా ఉన్న రెండు పోస్టుల్లో ఇద్దరు సభ్యులను ప్రభుత్వం నియమించింది. పి. సుధీర్, సోనీవుడ్ నూతులపాటిలను నియమిస్తూ మంగళవారం అర్ధరాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో అసాధారణ గెజిట్ ప్రచురణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్దాస్ జీవో 43 జారీ చేశారు.