ఉద్యమకారుల కుటుంబాలు రోడ్డునపడ్డాయి
ABN , First Publish Date - 2021-01-18T04:49:45+05:30 IST
ఉద్యమకారుల కుటుంబాలు రోడ్డునపడ్డాయి
సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆదుకోవాలి
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్
వడ్డెపల్లి, జనవరి 17: పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారుల కుటుంబాలు రోడ్డునపడ్డాయని, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హన్మకొండ వడ్డెపల్లి చర్చి జంక్షన్లోని ఎంజీపీ ఫంక్షన్హాలులో డాక్టర్ రామకృష్ణ, చుంచు రాజేందర్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ.. ఉద్యమకాలంలో, ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను విస్మరించిందని దుయ్యబట్టారు. తెలంగాణ వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందని విద్యా, వైద్య రంగాలు అభివృద్ధి జరిగి రైతులు బాగుపడతారనుకున్న ప్రజల ఆశలు అడియాసలయ్యాయని అన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా ఉద్యమకారుల కోసం సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో జమ్మికుంట జడ్పీటీసీ సభ్యుడు శ్యాం, కోలా జనార్దన్గౌడ్, సాయిని నరేందర్, సోమ రామ్మూర్తి, డాక్టర్ చిర్ర రాజు, మంద వీరస్వామి, రౌతు రమేశ్కుమార్, నలిగంటి చంద్రమౌళి, మేకల రవి, మాధవి, అరూరి కుమార్, సావిత్రి పాల్గొన్నారు. అనంతరం ఉద్యమకారులను ఘనంగా సత్కరించారు.