వ్యవసాయబావిలో గుర్తుతెలియని మృతదేహం
ABN , First Publish Date - 2022-01-19T04:52:03+05:30 IST
మండల పరిధిలోని పాత, కొత్తకమలాపురం గ్రామలమధ్య ఓ వ్యవసాయబావిలో మంగళవారం గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించారు. సుమారు 40ఏళ్ల వయస్సు ఉంటుందని, తెలుపు రంగులు దుస్తులు ధరించి ఉన్నాడు.
కారేపల్లి, జనవరి18: మండల పరిధిలోని పాత, కొత్తకమలాపురం గ్రామలమధ్య ఓ వ్యవసాయబావిలో మంగళవారం గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించారు. సుమారు 40ఏళ్ల వయస్సు ఉంటుందని, తెలుపు రంగులు దుస్తులు ధరించి ఉన్నాడు. కారేపల్లి ఎస్ఐ కుష్కుమార్తోపాటు ఖమ్మం పట్టణానికి చెందిన అన్నెం పౌండేషన్ సంస్థ అధినేత అన్నెం శ్రీనువా్సరావు మృతదేహన్ని వెలికితీశారు. సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. కొత్తకమలాపురం స్మశానవాటికలో ఖననం చేశారు. మూడురోజుల క్రితం మృతిచెందినట్లుగా బావిస్తున్నారు. కేసు నమోదు చేశారు.