స్వర్ణం తెస్తే రూ. 6 కోట్లు
ABN , First Publish Date - 2021-07-14T08:41:23+05:30 IST
ఒలింపిక్స్లో పోటీపడుతున్న తమ రాష్ట్ర అథ్లెట్లకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారీ నగదు ప్రోత్సాహకాలు ప్రకటించారు.
ఒలింపిక్ అథ్లెట్లకు యూపీ బంపర్ ఆఫర్
లఖ్నవ్: ఒలింపిక్స్లో పోటీపడుతున్న తమ రాష్ట్ర అథ్లెట్లకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారీ నగదు ప్రోత్సాహకాలు ప్రకటించారు. టోక్యో క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన ప్లేయర్కు ఏకంగా రూ. 6 కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. రజతం కొడితే రూ. 4 కోట్లు, కాంస్య పతకధారికి రూ. 2 కోట్లు నజరానా అందిస్తామన్నారు. టీమ్ ఈవెంట్లలో పసిడి గెలిచిన ఆటగాడికి రూ. 3 కోట్లు, రజతానికి రూ. 2 కోట్లు, కాంస్యానికి రూ. కోటి చొప్పున ఇస్తామన్నారు. ఈసారి ఒలింపిక్స్లో పాల్గొంటున్న భారత బృందంలో పదిమంది యూపీ అథ్లెట్లు ఉన్నారు.