యూఎస్ కాపిటోల్ దాడిపై విచారణ.. కన్నీళ్లు పెట్టుకున్న పోలీసు

ABN , First Publish Date - 2021-07-29T10:44:14+05:30 IST

అమెరికాలోని కాపిటోల్ హిల్‌పై ఈ ఏడాది ఆరంభంలో జరిగిన దాడి అగ్రరాజ్యంలో ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో

యూఎస్ కాపిటోల్ దాడిపై విచారణ.. కన్నీళ్లు పెట్టుకున్న పోలీసు

వాషింగ్టన్: అమెరికాలోని కాపిటోల్ హిల్‌పై ఈ ఏడాది ఆరంభంలో జరిగిన దాడి అగ్రరాజ్యంలో ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. జనవరి 6న జరిగిన ఈ ఘటనపై యూఎస్ కాంగ్రెషనల్ కమిటీలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా యూఎస్ కాపిటోల్ దాడిని ఎదుర్కున్న నలుగురు పోలీసు అధికారులను కమిటీ విచారించింది. ఈ సందర్భంగా కమిటీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఆ పోలీసు అధికారులు కన్నీరు పెట్టుకున్నారు. వారిలో ఒక అధికారి తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని కూడా చెప్పారు. ‘‘నా గన్ను లాక్కొని నన్నే చంపేసే ప్రమాదాన్ని ఎదుర్కొన్నా’’ అని ఆ అధికారి వివరించాడు. ఈ ఘటన తర్వాత అమెరికా అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

Updated Date - 2021-07-29T10:44:14+05:30 IST