సమస్యలపై యూటీఎఫ్ పోరుబాట
ABN , First Publish Date - 2021-08-02T08:28:17+05:30 IST
గిరిజన, మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 4న అన్ని ఐటీడీఏ కార్యాలయాలు, ఆరో తేదీన అన్ని మున్సిపల్
అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): గిరిజన, మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 4న అన్ని ఐటీడీఏ కార్యాలయాలు, ఆరో తేదీన అన్ని మున్సిపల్ కార్యాయాల వద్ద ధర్నాలు చేపట్టనున్నామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ గిరిజన ప్రాంత పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలల్లో అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులకూ సమస్యలున్నాయని ఎంతోకాలంగా చెప్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. అందుకే పోరుబాట పట్టామని పేర్కొన్నారు.