ఆ ‘పేటెంట్’ వేరెవరికీ దక్కకూడదనే: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2020-08-16T01:55:43+05:30 IST

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. భూకబ్జాలకు పాల్పడితే ఊరుకునేది లేదంటూ విజయసాయి రెడ్డి చేసిన కామెంట్లపై సెటైర్లు వేశారు. భూ కబ్జాల ‘పేటెంట్’

ఆ ‘పేటెంట్’ వేరెవరికీ దక్కకూడదనే: వర్ల రామయ్య

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. భూకబ్జాలకు పాల్పడితే ఊరుకునేది లేదంటూ విజయసాయి రెడ్డి చేసిన కామెంట్లపై సెటైర్లు వేశారు. భూ కబ్జాల ‘పేటెంట్’ ఆయనకు తప్ప వేరెవరికీ దక్కకూడదనే అలాంటి వ్యాఖ్యలు చేశారంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘విజయసాయి  రెడ్డి గారూ! బాగా సెలవిచ్చారు. విశాఖలో ఎవరు భూకబ్జాలకు పాల్పడినా వదిలేది లేదన్నారు. ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని కోరారు. మీ పార్టి వారిని కూడా వదలకూడదని అద్భుతమైన నీతి వ్యాక్యాలు పలికారు. మీకు అభినందనలు. అవునులే, ఆ ‘పేటెంట్’ వేరెవరికీ దక్కకూడదు. అంతేకదా? బహుపరాక్ విశాఖ!’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2020-08-16T01:55:43+05:30 IST