జగన్‌తో‌ విభేదాల వార్తలపై విజయసాయి క్లారిటీ

ABN , First Publish Date - 2020-06-01T21:36:27+05:30 IST

తాను చనిపోయేవరకు సీఎం జగన్‌కు, ఆయన కుటుంబానికి విధేయుడిగానే ఉంటానని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తనను శంకించాల్సిన పనిలేదన్నారు.

జగన్‌తో‌ విభేదాల వార్తలపై విజయసాయి క్లారిటీ

అమరావతి: తాను చనిపోయేవరకు సీఎం జగన్‌కు, ఆయన కుటుంబానికి విధేయుడిగానే ఉంటానని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తనను శంకించాల్సిన పనిలేదన్నారు. ‘‘నాకు, మా అధ్యక్షుడు జగన్‌కి ఎలాంటి విభేదాలు లేవు..రావు’’ అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థని కించపరిచే ఉద్దేశంగానీ.. అగౌరవపరిచే ఉద్దేశం ఏ ఒక్క వైసీపీ కార్యకర్తకు లేదని చెప్పారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు అడ్డగోలుగా పెట్టిన పోస్టులకు..  కేసులు పెట్టి అరెస్ట్‌ చేసి ఉంటే ఎన్ని జైళ్లు అయినా సరిపోవని తెలిపారు. అలాగని తాము న్యాయవ్యవస్థను కించపరచడం లేదని, హైకోర్టును గౌరవిస్తున్నామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. 


నిమ్మగడ్డ రమేష్‌కుమారే ఎస్‌ఈసీగా ఉండాలని టీడీపీ కోర్టుకు వెళ్లడం ఏంటి? అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం లేకున్నా..వాళ్ల మనుషులే ఉండాలనుకుంటున్నారని, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వంపై విషం కక్కారని మండిపడ్డారు. ఆయన రాసిన లేఖలో ఏవేవి ఉన్నాయో అన్నీ చూశామని, టీడీపీ కార్యాలయంలోనే ఆ లేఖ తయారైందని విజయసాయిరెడ్డి తెలిపారు.

Updated Date - 2020-06-01T21:36:27+05:30 IST