అయోధ్యలో భూమిపూజ...విజయవాడలో సంబరాలు
ABN , First Publish Date - 2020-08-05T18:18:23+05:30 IST
అయోధ్యలో భూమిపూజ...విజయవాడలో సంబరాలు
విజయవాడ: అయోధ్యలో భూమి పూజ నేపథ్యంలో విజయవాడ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. కాషాయం జండాలు ధరించి పెద్ద ఎత్తున జై శ్రీరామ్ అంటూ భక్తులు నినాదాలు చేశారు. కార్యాలయం ముందు వీహెచ్పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.